రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ
ABN , First Publish Date - 2021-09-08T21:52:04+05:30 IST
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ వ్యవహరాల ఇన్ఛార్జీ
ఢిల్లీ: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ వ్యవహరాల ఇన్ఛార్జీ మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, గీతారెడ్డి తదితరులు హాజరైనారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తాము చేస్తున్న ప్రయత్నాలను నేతలు వివరించనున్నారు. పీసీసీలో మార్పులు తర్వాత రాహుల్తో తొలిసారి భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు. వరంగల్లో నిర్వహించే దళిత, గిరిజన దండోరా సభకు రావాలని రాహుల్ గాంధీని టీపీసీసీ నేతలు కోరనున్నారు.