గవర్నర్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం

ABN , First Publish Date - 2021-01-12T17:56:39+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య, వీసీల నియామకం, ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర గవర్నర్ తమిళ్ సౌందర్య రాజన్‎ని మంగళవారం రోజు బీజేపీ ప్రతినిధులు కలిసారు...

గవర్నర్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య, వీసీల నియామకం, ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర గవర్నర్ తమిళ్ సౌందర్య రాజన్‎ని మంగళవారం రోజు బీజేపీ ప్రతినిధులు కలిసారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి బీజేపీ నాయకులు గవర్నర్‎కు ఫిర్యాదు చేశారు. త్వరగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గవర్నర్‌తొ భేటీ అయిన వారిలో బీజేపీ నేతలు లక్ష్మణ్, మురళీధర్ రావ్, రామచందర్ రావు ఉన్నారు.

Updated Date - 2021-01-12T17:56:39+05:30 IST