సెప్టెంబరు 10 నుంచి 17 వరకు.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు

ABN , First Publish Date - 2021-08-25T09:08:08+05:30 IST

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను సెప్టెంబరు 10 నుంచి 17 వరకు నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

సెప్టెంబరు 10 నుంచి 17 వరకు.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినే ని వీరభద్రం 

హైదరాబాద్‌, ఆగస్టు 24( ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను సెప్టెంబరు 10 నుంచి 17 వరకు నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రతి గ్రామంలో సభలు, ర్యాలీలు ఉంటాయని వెల్లడించారు. బైరాన్‌పల్లి బురుజు, దొడ్డి కొమురయ్య స్థూపం, పోరాట యోధుల స్మారకాలు ఉన్న దగ్గర భారీ ర్యాలీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంగళవారం తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విషయంలో బీజేపీ వక్ర భాష్యాలకు పాల్పడడం సరికాదని, ఆ పార్టీ ఆటలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. మోదీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 4న అన్ని గ్రామాల్లో ప్రదర్శనలు, 6న కలెక్టరేట్లు, మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపడతామని ప్రకటించారు. దళిత బంధు మాదిరిగా గిరిజన బంధు అమలు చేయాలని పోరాడతామని తమ్మినేని తెలిపారు.

Updated Date - 2021-08-25T09:08:08+05:30 IST