డ్రగ్స్‌ కేసులో ఈడీ ఎదుట హాజరైన తనీశ్‌

ABN , First Publish Date - 2021-09-18T08:56:56+05:30 IST

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటు డు తనీశ్‌.. శుక్రవారం ఉదయం 10.30కు ఈడీ విచారణకు హాజరయ్యారు.

డ్రగ్స్‌ కేసులో ఈడీ ఎదుట హాజరైన తనీశ్‌

  • 7 గంటల పాటు సాగిన విచారణ
  • 22న హాజరు కానున్న తరుణ్‌ 

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటు డు తనీశ్‌.. శుక్రవారం ఉదయం 10.30కు ఈడీ విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 5.30 వరకు ఆయనను ఈడీ అధికారులు విచారించారు. తనీశ్‌ తన బ్యాంకు ఖాతాల వివరాలు, వివిధ డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు సమర్పించారు. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితులైన కెల్విన్‌, జిషాన్‌ అలీలతో ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు తనీశ్‌ను ప్రశ్నించారు. అదేక్రమంలో పలువురు సినీ ప్రముఖుల నుంచి తనీశ్‌ బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ అయిన విషయంపైనా విచారించారు. విచారణ అనంతరం తనీశ్‌ విలేకరులతో మాట్లాడు తూ.. తాను ఈడీ విచారణకు సహకరిస్తానన్నారు. కాగా, టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో ఇప్పటికే పూరీ జగన్నాథ్‌, చార్మీకౌర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రాణా , రవితేజ, డ్రైవర్‌ శ్రీనివాస్‌, నందు, నవదీప్‌, ముమైత్‌ఖాన్‌, ఎఫ్‌క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ విచారణకు హాజరయ్యారు. 22న మరో నటుడు తరుణ్‌ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.

Updated Date - 2021-09-18T08:56:56+05:30 IST