మల్లారెడ్డి కబ్జాలపై చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2021-05-08T08:07:04+05:30 IST
మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఎ్సయూఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
- అక్రమ నిర్మాణాలను కొవిడ్ ఆస్పత్రులుగా మార్చండి
- మల్లారెడ్డి ఆస్పత్రి ముందు ఎన్ఎ్సయూఐ ఆందోళన
- దవాఖానా అద్దాలు ధ్వంసం, ఆస్పత్రి పేరు తొలగింపు
జీడిమెట్ల, మే 7 (ఆంధ్రజ్యోతి): మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఎ్సయూఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాఽధనలో కొట్లాడిన వారిపై భూ కబ్జా ఆరోపణలు చేసి, మంత్రి పదవుల నుంచి తొలగించిన సీఎం కేసీఆర్.. అనేక మంది మంత్రులు వందల ఎకరాలు కబ్జా చేసినా, ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. భూ కబ్జాలకు పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సూరారంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీ ఎదుట ఎన్ఎ్సయూఐ నాయకులు, కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించి ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి ఆస్పత్రి పేరును తొలగించి, అద్దాలు ధ్వంసం చేశారు. సూరారం చెరువును కబ్జా చేసి నిర్మించిన ఆస్పత్రులు, భవనాలను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకుని కొవిడ్ ఆస్పత్రులుగా మార్చాలని కోరారు. మల్లారెడ్డి ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మాట్లాడుతూ కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు చేపడుతుంటే ఈ తరహా దాడులు చేయడం సరికాదన్నారు. తమ ఆస్పత్రిలో డబ్బులు లేని వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నామని చెప్పారు.