కొవిడ్పై పోరుకు సన్ టీవీ విరాళం రూ. 30 కోట్లు
ABN , First Publish Date - 2021-05-11T12:10:21+05:30 IST
కొవిడ్ సంక్షోభంలో సాయం అందించే కార్యక్రమంలో భాగంగా
హైదరాబాద్ : కొవిడ్ సంక్షోభంలో సాయం అందించే కార్యక్రమంలో భాగంగా సన్టీవీ గ్రూప్ రూ. 30 కోట్లు విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని కేంద్రంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కొవిడ్ సహాయక కార్యకలాపాల కోసం వెచ్చిస్తామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఆక్సిజన్, మందులు అందించే స్వచ్ఛంద సంస్థలకు సైతం సాయమందిస్తామని తెలిపింది. తమ మీడియా సంస్థ ద్వారా ప్రజల్లో కరోనా వ్యాప్తిపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తామని తెలిపింది.