వరంగల్ జిల్లాలో ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-02-27T23:51:01+05:30 IST
నగరంలోని మిల్స్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.
వరంగల్ : నగరంలోని మిల్స్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధ భరించలేక గిలగిల కొట్టుకుని బాధితుడు కిందపడి పోయాడు. ఒంటికి నిప్పటించుకున్న అనంతరం బాధితుడు కిందపడి కేకలు పెట్టాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.