ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించండి: సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2021-07-09T23:35:56+05:30 IST
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఉద్యోగ ఖాళీల భర్తీపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి భేటీ జరిగింది. తొలి దశలో అన్ని శాఖల్లో కలిపి 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రెండో దశలో ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నూతన జోనల్ విధానానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించింది. భర్తీ ప్రక్రియకు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయని కేసీఆర్ తెలిపారు. పూర్తి సమాచారంతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.