SIDDIPET: అక్కన్నపేటలో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్
ABN , First Publish Date - 2021-07-22T17:36:43+05:30 IST
అక్కన్నపేట మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఏఐసిసి పిలుపు మేరకు రేపు చలో రాజ్ భవన్ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు...
సిద్ధిపేట: అక్కన్నపేట మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఏఐసిసి పిలుపు మేరకు రేపు చలో రాజ్ భవన్ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య మాట్లాడుతూ.. ముందస్తు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. ఇజ్రాయేల్కు చెందిన పెగాసెస్ స్పైవేర్ ఉపయోగించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాల ఫోన్లను కేంద్రం ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరును తాము నిరసిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందని ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.