షర్మిలకు ఊహించని షాక్

ABN , First Publish Date - 2021-08-23T23:08:49+05:30 IST

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిలకు ఊహిచని షాక్ తగిలింది. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షల్లో భాగంగా ఈ నెల 24న మంచిర్యాల

షర్మిలకు ఊహించని షాక్

మంచిర్యాల: వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షల్లో భాగంగా ఈ నెల 24న మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టాలని షర్మిల నిర్ణయించారు. అయితే దీక్ష ముందు రోజే షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. దీక్ష కోసం తమ ఇంటికి రావొద్దంటూ నిరుద్యోగి నరేష్‌ తండ్రి విజ్ఞప్తి చేశారు. దీంతో వైఎస్‌ఆర్‌టీపీ నేతలు పునాలోచనలో పడ్డారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేయాలని ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఉన్నఫలంగా నరేష్ తండ్రి నిర్ణయంతో ఆలోచనలో పడ్డారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన నరేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. నరేష్ ముగ్గురు అన్నలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. నరేష్‌కు ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయం చేస్తూ తన తండ్రికి చేదోడుగా ఉన్నాడు. అయితే తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత మంగళవారం మహబూబాబాద్‌ నియోజకవర్గంలోని గూడూరు మండలం గుండెంగ గ్రామంలో షర్మిల దీక్ష చేశారు. గ్రామ సమీపంలోని సోమ్లా తండాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడ సునీల్‌ నాయక్‌ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. 

Updated Date - 2021-08-23T23:08:49+05:30 IST