వివరాలు చెప్పేందుకు మొండికేసిన శిల్పా చౌదరి
ABN , First Publish Date - 2021-12-04T00:30:15+05:30 IST
శిల్పాచౌదరి కేసులో మొదటి రోజు పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. శిల్పాచౌదరిని 6 గంటల నార్సింగి పోలీసులు పాటు విచారించారు.
హైదరాబాద్: శిల్పాచౌదరి కేసులో మొదటి రోజు పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. శిల్పాచౌదరిని 6 గంటల నార్సింగి పోలీసులు పాటు విచారించారు. శిల్పా బినామీలు, బ్యాంక్ స్టేట్మెంట్లపై పోలీసుల ఆరా తీశారు. ఫిర్యాదులుపై విచారించి శిల్పా స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారనే కోణంలో విచారణ సాగినట్లు తెలుస్తోంది. కాల్ డేటాలోని కొంత మంది వ్యక్తులను పోలీసులు సంప్రదించారు. తొలుత పోలీసులకు వివరాలు చెప్పేందుకు శిల్పా మొండికేసినట్లు తెలుస్తోంది. ఆధారాలు ముందు ఉంచడంతో ఆమె నోరువిప్పినట్లు సమాచారం. తనకు డబ్బు ఇచ్చిన వారు చాలా మంది అప్పుగా ఇచ్చారని, కొంత మంది బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు ఇచ్చారని విచారణలో శిల్పా చౌదరి ,చెప్పినట్లు తెలుస్తోంది.