నేటి నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర

ABN , First Publish Date - 2021-12-19T07:03:56+05:30 IST

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఆదివారం నుంచి రైతు ఆవేదన యాత్ర చేపట్టనున్నారు.

నేటి నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర

తొలి రోజు ఉమ్మడి మెదక్‌లో పర్యటన


హైదరాబాద్‌, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఆదివారం నుంచి రైతు ఆవేదన యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలన్న డిమాండ్‌తో ఈ యాత్రను చేపడుతున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి పార్టీ తరపున ఆర్థిక సాయం చేయనున్నారు. ఆదివారం లోట్‌సపాండ్‌  నుంచి యాత్ర ప్రారంభం కానుంది. తొలి రోజున ఉమ్మడి మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం కంచనపల్లి, లింగంపల్లి గ్రామాలకు వెళ్లనున్నారు. కంచనపల్లిలో గుండ్ల శ్రీకాంత్‌, మహేశ్‌ అనే రైతుల కుటుంబాలను, లింగంపల్లిలో షేకులు అనే రైతు కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. 

Updated Date - 2021-12-19T07:03:56+05:30 IST