8 నెలలు గడిచినా ఆరోగ్యశ్రీలో కరోనా చేరలేదే: షర్మిల
ABN , First Publish Date - 2021-05-16T01:29:44+05:30 IST
కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి 8 నెలలు గడిచిందని, కానీ ఇప్పటికీ అది నేరవేరలేదని షర్మిల ఆగ్రహం..
హైదరాబాద్: కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి 8 నెలలు గడిచిందని, కానీ ఇప్పటికీ అది నేరవేరలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడు కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కేసీఆర్ సర్కార్పై షర్మిల విరుచుకుపడ్డారు. ‘మీ లెక్కకు సరిపడా మరణాలు నమోదు కాలేదనా?. ప్రజలు తిరగబడక ముందే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి. లేకుంటే కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవడం ఖాయం’ అంటూ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.