రూ.20కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
ABN , First Publish Date - 2021-06-22T08:47:16+05:30 IST
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం భారీగా హెరాయిన్ పట్టుబడింది.
శంషాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం భారీగా హెరాయిన్ పట్టుబడింది. టాంజానియా దేశస్తుడు జాన్ విలియమ్స్ దోహా నుంచి డ్రగ్స్ తెస్తున్నాడనే ముందస్తు సమాచారంతో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు (డీఆర్ఐ) లగేజీని తనిఖీ చేశారు. బ్యాగులో రూ. 20కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.