వైభవంగా ఉజ్జయిని మహంకాళీ బోనాలు
ABN , First Publish Date - 2021-07-25T16:39:29+05:30 IST
అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్: అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతున్నాయి. భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుంచి అమ్మ వారిని దర్శించుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని అధికారుల సూచించారు. కాగా కరోనా భయంతో భక్తుల రద్దీ కొంచెం తగ్గింది. అధికారులు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఆలయానికి చుట్టూ కిలోమీటర్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బోనాలతో వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.