సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి పెరుగుతున్నకేసులు

ABN , First Publish Date - 2021-11-05T21:54:51+05:30 IST

దీపావళి రోజున ఎంతో సంతోషంగా బాణా సంచా (క్రాకర్స్) కాల్చేందుకు పిల్లలు, పెద్దలుకూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.

సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి పెరుగుతున్నకేసులు

హైదరాబాద్: దీపావళి రోజున ఎంతో సంతోషంగా బాణా సంచా (క్రాకర్స్) కాల్చేందుకు పిల్లలు, పెద్దలుకూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. కానీ చిన్న పాటి అలసత్వం వల్ల ప్రమాదాల పాలుఅవుతుంటారు. ఈ సారి దీపావళి పండగ రోజున కూడా జంటనగరాల్లోని ప్రాంతాల్లో కంటి గాయాలుకావడంతో సరోజిని కంటి ఆస్పత్రిలో చేరారు.శుక్రవారం నాటికి సరోజిని కంటి ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 32కు చేరిందని వైద్యులు తెలిపారు. కొందరు చిన్న చిన్న గాయలతో చికిత్స కోసం ఆస్పత్రికి రాగా, మరి కొందరు పెద్దగాయలతోనే వచ్చినట్టు తెలిపారు.


 స్వల్పంగా గాయ పడిన వారికి చికిత్స చేసి పంపుతుండగా,తీవ్రంగా గాయపడిన వారిని ఇన్ పేషెంట్ లుగా చేర్చుకుంటున్నారు. బాణా సంచా కాల్చే సమయంలో అలసత్వం కారణంగానే గాయాల పాలవుతున్నారు. కాగా చాంద్రాయణ గుట్టకు చెందిన రాజ్ తివారి అనే వ్యక్తి ఒక కన్ను కోల్పోయారు. ఆస్పత్రికి చిన్న చిన్నగాయలతో చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతన్నట్టు ఆస్పత్రి వర్గాలుతెలిపాయి. 

Updated Date - 2021-11-05T21:54:51+05:30 IST