రాజ్భవన్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
ABN , First Publish Date - 2021-01-15T00:00:39+05:30 IST
సంక్రాంతి సంబురాలు రాజ్భవన్లో ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజ్భవన్సిబ్బందితో కలిసి ఉత్సవాల్లోపాల్గొన్నారు.
హైదరాబాద్: సంక్రాంతి సంబురాలు రాజ్భవన్లో ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజ్భవన్సిబ్బందితో కలిసి ఉత్సవాల్లోపాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ సాంప్రదాయక వంటకాలను తయారుచేసి అందరికీ పంచిపెట్టారు. సాంప్రదాయక పద్దతిలో జరిగిన ఈ ఉత్సవాల్లో గవర్నర్ రాజ్భవన్ సిబ్బంది కుటుంబాలతో కలిసి సరదాగా గడిపారు. సంక్రాంతిపండగ ప్రకృతి పండగగా ఆమె అభివర్ణించారు. ఈసందర్భంగా గవర్నర్ గాలిపటాలను కూడా ఎగుర వేశారు. గాలిపటాల పై పలు సందేశాలు కరోనా వ్యాక్సిన్,కు సంబంధించి అవర్వ్యాక్సిన్ అవర్ ప్రైడ్, అవర్ కంట్రీ అండ్ అవర్ వ్యాక్సిన్, అవర్ వ్యాక్సిన్ సేఫ్ వ్యాక్సిన్, ఆత్మనిర్భర్ భారత్ వంటి సందేశాలతో కూడిన పతంగులను ఎగుర వేశారు.
వీటితో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే పలు రకాల చిత్రాలతో కూడిన పతంగులను కూడా ఆమె ఎగుర వేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని, ముందుగా ఫ్రంట్లైన్వారియర్స్ను వీటిని అందజేస్తామని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు.