స్త్రీ నిధి ద్వారా రూ.50 లక్షల కాన్సంట్రేటర్లు
ABN , First Publish Date - 2021-05-21T08:44:11+05:30 IST
స్త్రీ నిధి ద్వారా రూ.50 లక్షల కాన్సంట్రేటర్లు

హైదరాబాద్, మే 20(ఆంధ్రజ్యోతి): స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రూ.50 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కరోనా బాధితులకు అందజేశారు. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ తీసుకున్న పటిష్టమైన చర్యల్లో భాగంగానే స్త్రీ నిధి బ్యాంకు ద్వారా ఈ సహకారం అందిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వీటిని రాష్ట్రంలో 8 ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందజేస్తున్నామన్నారు.