ట్యాంక్ బండ్పై ఘోర రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి మృతి
ABN , First Publish Date - 2021-12-29T15:51:57+05:30 IST
ట్యాంక్ బండ్పై జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
హైదరాబాద్: ట్యాంక్బండ్పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్యాంక్ బండ్పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొనడంతో మూడేళ్ల చిన్నారి శ్రీ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో తల్లి సామాన్య, తండ్రి శివకుమార్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సామాన్య పరిస్థితి విషమంగా ఉంది. వారు రాయదుర్గం నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కి వెళ్తుండగా ట్యాంక్బండ్పై ఈ ఘటన జరిగింది. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గాంధీనగర్ పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.