రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-01-19T13:41:08+05:30 IST
రాజన్న సిరిసిల్ల: గంభీరావుపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్తఫా నగర్ గ్రామంలో ఒగ్గు కథ చెప్పి
రాజన్న సిరిసిల్ల: గంభీరావుపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్తఫా నగర్ గ్రామంలో ఒగ్గు కథ చెప్పి బైక్లపై ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఒకరినొకరు ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మృతులు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల దేవయ్య, నామాపూర్ గ్రామానికి చెందిన గడ్డి ఆడవయ్యలుగా గుర్తించారు.