రెండు బైకులను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2021-03-21T19:32:56+05:30 IST

రెండు బైకులను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

రెండు బైకులను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

వికారాబాద్: జిల్లాలోని దోమ మండలం బొంపల్లి సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-03-21T19:32:56+05:30 IST