ఆమనగల్లు శివారులో రోడ్డుప్రమాదం
ABN , First Publish Date - 2021-03-21T13:40:01+05:30 IST
ఆమనగల్లు శివారులో రోడ్డుప్రమాదం

మహబూబాబాద్: జిల్లాలోని ఆమనగల్లు శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ డోర్ ఊడిపోయి క్రింద పడిపోయిన ప్రమాదంలో 12 మంది కూలీలకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే వరంగల్ రూరల్ జిల్లాలో ఆటోప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.