కేవలం మర్యాద పూర్వకంగా డీఎస్ను కలిసా..: రేవంత్
ABN , First Publish Date - 2021-10-14T21:12:13+05:30 IST
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం మర్యాద పూర్వకంగానే డీఎస్ను కలిసానన్నారు. ఆయన కిందపడిపోగా చెయ్యి విరిగిందని, ఈ విషయం తెలిసి పరామర్శించేందుకు వచ్చానన్నారు. ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండవని, శ్రీనివాస్ తనకు చాలా దగ్గర మనిషని అందుకే పలకరించేందుకు వచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
డి. శ్రీనివాస్ మాట్లాడుతూ తాను కిందపడిపోగా చెయ్యి విరిగిందన్నారు. ఈ విషయం తెలిసిన రేవంత్ తనను పలకరించటానికి వచ్చారన్నారు. ఇందులో రాజకీయాలు లేవన్నారు. వయస్సులో చిన్నవాడైనా... తాను కింద పడ్డానని తెలిసి వచ్చారన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి పలకరించడానికి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని డీఎస్ తెలిపారు.