రెండుసార్లు పట్టంకట్టడమే నేరమా?: రేవంత్
ABN , First Publish Date - 2021-10-03T02:21:42+05:30 IST
శ్రీకాంతాచారికి నివాళులర్పిద్దామంటే నిరంకుశంగా అడ్డుకున్నారని టీపీసీపీ చీఫ్ రేవంత్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అమరవీరులను స్మరించుకోవడాన్ని నిషేధిస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్: శ్రీకాంతాచారికి నివాళులర్పిద్దామంటే నిరంకుశంగా అడ్డుకున్నారని టీపీసీపీ చీఫ్ రేవంత్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అమరవీరులను స్మరించుకోవడాన్ని నిషేధిస్తున్నారని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండుసార్లు పట్టంకట్టడమే విద్యార్థులు, నిరుద్యోగులు చేసిన నేరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రగతిభవన్లో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పిస్తామన్నారు.