ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయండి
ABN , First Publish Date - 2021-03-08T08:51:47+05:30 IST
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని సికింద్రాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వై.సత్యేంద్ర పోలీసులను ఆదేశించారు.
సికింద్రాబాద్ ‘సెషన్స్’ జడ్జి ఆదేశం
పరకాల, మార్చి 7: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని సికింద్రాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వై.సత్యేంద్ర పోలీసులను ఆదేశించారు. వరంగల్లో జనవరి 31న నిర్వహించిన ఓసీ జేఏసీ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల మనోభావాలను దెబ్బతీసేలా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్స్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కల్పగిరి మహేశ్వరరాజు ఫిబ్రవరి 6న శాలిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతోపాటు కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. దీంతో ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై కేసు నమోదు చేయాలని జడ్జి పోలీసులను ఆదేశించారు. ఈ విషయమై ఏప్రిల్ 1లోపు తమనకు పూర్తి నివేదిక అందించాలని సూచించినట్లు సమాచారం.