లోయర్‌ టైప్‌ రైటింగ్‌ 4వ బ్యాచ్‌కు ‘రీ-ఎగ్జామ్‌’

ABN , First Publish Date - 2021-08-25T08:53:39+05:30 IST

ఈనెల 28న టైప్‌ రైటింగ్‌ లోయర్‌ గ్రేడ్‌ నాలుగో బ్యాచ్‌, పేపర్‌-2కు మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ నిర్ణయించింది.

లోయర్‌ టైప్‌ రైటింగ్‌ 4వ బ్యాచ్‌కు ‘రీ-ఎగ్జామ్‌’

సర్క్యూలర్‌ను విడుదల చేసిన సాంకేతిక విద్యా శాఖ

కుషాయిగూడ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఈనెల 28న టైప్‌ రైటింగ్‌ లోయర్‌ గ్రేడ్‌ నాలుగో బ్యాచ్‌, పేపర్‌-2కు మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఎస్‌బీటీఈటీ కార్యదర్శి డాక్టర్‌ సి.శ్రీనాథ్‌ సర్క్యులర్‌ను విడుదల చేశారు. 22న జరిగిన టైప్‌ రైటింగ్‌ లోయర్‌ గ్రేడ్‌ మాన్యుస్ర్కిప్ట్‌ పేపర్‌-2 పరీక్ష పత్రానికి బదులుగా హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షాపత్రం ఇవ్వడంతో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బ్యాచ్‌లోని అభ్యర్థులకు మాత్రమే రీ-ఎగ్జామ్‌ నిర్వహించాలని బోర్డు అధికారుల సమావేశం తీర్మానించింది. కాగా, బోర్డు రీ-ఎగ్జామ్‌ నిర్ణయంపై ఇన్‌స్టిట్యూట్‌ల నిర్వాహకులు, విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రీ-ఎగ్జామ్‌ అనివార్యమైతే మొదటి పేపర్‌ స్పీడ్‌ టెస్ట్‌ కూడా నిర్వహించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2021-08-25T08:53:39+05:30 IST