పత్తికి రికార్డు ధర
ABN , First Publish Date - 2021-12-31T08:48:35+05:30 IST
దిగుబడులు తగ్గడం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండడంతో పత్తి ధర పైపైకిఎగబాకుతోంది.
![పత్తికి రికార్డు ధర](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఖమ్మంలో క్వింటాకు రూ. 9,100, మద్నూరులో 9,050
ఖమ్మంమార్కెట్/కేసముద్రం/మద్నూర్, డిసెంబరు 30: దిగుబడులు తగ్గడం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండడంతో పత్తి ధర పైపైకిఎగబాకుతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం క్వింటాలు పత్తి ని రూ.9,100కు కొనుగోలు చేశారు. మరోవైపు, కామారెడ్డి జిల్లామద్నూర్ మార్కె ట్ యార్డులో రూ.9,050, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రూ.9,001 పలికింది.