కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి: ఆర్డీవో

ABN , First Publish Date - 2021-02-26T05:05:34+05:30 IST

కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి: ఆర్డీవో

కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి: ఆర్డీవో
దామెర పోలింగ్‌ కేంద్రంలో తనిఖీ చేస్తున్న ఆర్డీవో

దామెర, ఫిబ్రవరి 25: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం దామెర పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేయా లని ఆర్డీవో కిషన్‌ సూచించారు. గురువారం దామెర ప్రభుత్వ ఉ న్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రా లను ఆర్డీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టభ ద్రులు తమ ఓటు హక్కును విని యోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎమ్డీ.రియాజొద్దీన్‌, వీఆర్‌వోలు ఎస్‌.సతీష్‌, జె.బాబు తదితరులు పాల్గొన్నారు.

- ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కొవిడ్‌–19 నిబంధనలు పాటించాలని ఆర్డీవో కిషన్‌ ఆదేశించారు. దామెర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఒగ్లాపూర్‌ ఎస్‌బీఐటీ ఇంజ నీరింగ్‌ ఆవరణలోని మైనారిటీ గురుకుల పాఠశాల, జ్యోతిబాఫూలే గురుకుల పాఠ శాలలను  పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్‌, జడ్పీటీసీ జి.కల్ప న, వీఆర్‌వోలు సతీష్‌, బాబు, హెచ్‌ఎం సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T05:05:34+05:30 IST