Rajanna Sirisilla: ఆలయ అర్చకులు లోపలికి రాకుండా తాళం వేసిన అటెండర్
ABN , First Publish Date - 2021-09-02T16:43:22+05:30 IST
శ్రావణమాసం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో
రాజన్న సిరిసిల్ల: వేములవాడ దేవస్థానంలో అర్చకులను అటెండర్ అడ్డుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పదే పదే లోపలికి వెళ్లడం.. బయటకు రావడం ఏంటని అటెండర్ అర్చకులను ప్రశ్నించారు. అర్చకులు ఆలయంలోకి రాకుండా గేట్కు తాళం వేసి అటెండర్ దేవయ్య అడ్డుపడ్డారు. అంతేకాకుండా ఆలయ స్థానాచార్యులు భీమశంకర్ను కూడా బయటే ఉంచి అటెండర్ దేవయ్య గేటుకు తాళం వేశారు. దీంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.