రాహుల్..ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలి
ABN , First Publish Date - 2021-06-20T11:06:30+05:30 IST
ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్గాంధీ మళ్లీ బాధ్యతలు చేపట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్గాంధీ మళ్లీ బాధ్యతలు చేపట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి దేశ ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు. అసెంబ్లీ మీడియా పాయిట్లో శనివారంఎమ్మెల్సీ జీవన్రెడ్డితో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. దేశ నిర్మాణానికి సంబంధించి రాహుల్ గాంధీ ఒక విజన్ ఉన్న నాయకుడని కితాబు ఇచ్చారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మొదట్లోనే ప్రధాని మోదీకి రాహుల్ సూచించారని, ఆయన మాటలను కేంద్రం పట్టించుకొని ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు. కరోనాతో లక్షల మంది చనిపోవడానికి పరోక్షంగా మోదీనే కారణమని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దీక్ష చేపడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్గాంధీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.