ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించాం: రేవంత్
ABN , First Publish Date - 2021-11-06T23:28:36+05:30 IST
ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు సమస్యలు తెలుసుకోవడానికి ఆదివారం 4 బృందాలు పర్యటిస్తాయని తెలిపారు. పెట్రో ధరలు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ దొంగలుగా మారాయని దుయ్యబట్టారు. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్పై కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని రూ.10 లక్షలిచ్చి సీఎం కేసీఆర్ కొనాలనుకున్నారని రేవంత్రెడ్డి మండిపడ్డారు.