పశుసంవర్ధక శాఖలో పదోన్నతుల సంబురాలు

ABN , First Publish Date - 2021-02-01T21:59:38+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను చేపట్టి ,త్వరగాపదోన్నతులు కల్పించాలన్న ఆదేశానుసారం

పశుసంవర్ధక శాఖలో పదోన్నతుల సంబురాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  పదోన్నతుల ప్రక్రియను చేపట్టి ,త్వరగాపదోన్నతులు కల్పించాలన్న ఆదేశానుసారం జనవరి,31వ తేదీ వరకు పశువైద్య, పశుసంవర్ధక శాఖలోఅర్హత కలిగిన అన్ని స్థాయి / కాడర్ఉద్యోగులకు(146) మందికిపదోన్నతులు వందశాతం కల్పించామని ఆ శాఖ సంచాలకులు డా. లక్ష్మారెడ్డి గారు తెలియజేసినారు. పశు సంవర్ధక శాఖలో వివిధ స్థాయీఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసి, ఇందులో బాగంగా పశుసంవర్ధక శాఖలో వివిధ స్థాయిలలోపనిచేయుచున్న పారా వెటర్నరీ సిబ్బంది (5) మందికి వెటర్నరీ అసిస్టెంట్ నుండి లైవ్ స్టాక్ అసిస్టెంట్ గా, 49 మందికిలైవ్ స్టాక్ అసిస్టెంట్ నుండిజూనియర్ వెటర్నరీ ఆఫీసర్ గా, మరో 29 మందికి జూనియర్వెటర్నరీ ఆఫీసర్ గా ,వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ గా పదోన్నతి కల్పించడం జరిగింది.


అదేవిధంగామినిస్టిరియాల్ (7) మందికి జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ గా ఇద్దరికి సీనియర్అసిస్టెంట్ నుండి సూపరింటెండెంట్ గా మరొకరికి సూపరింటెండెంట్ నుండి గెజిటెడ్ ఆఫీస్ మేనేజర్ గా పదోన్నతి కల్పించామని తెలిపారు.అదేవిధంగా 38 మందికి పశువైద్యులను (వెటర్నరీ డాక్టర్లు ) సహాయ సంచాలకులుగా, 9 మందికిసహాయ సంచాలకుల నుంచి ఉపసంచాలకులుగాపదోన్నతి కలిపించాము.


మిగిలిన సహాయ సంచలకులుకు త్వరలోఖాళీ అవుతున్నఉపసంచాలకులు పోస్టులలో భర్తీ చేయడం జరుగుతుందని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న10 సంయుక్త సంచాలకులలో గాను అర్హత కలిగిన ఐదుగురికి సంయుక్త సంచాలకులుగా, అలాగే రాష్ట్ర కేడర్ పోస్ట్ అయిన (1) అదనపు సంచాలకుల నుండి సంచాలకులుగా పదోన్నతి కలిపించడం జరుగుతుందని  పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. లక్ష్మారెడ్డి తెలియజేసినారు.

Updated Date - 2021-02-01T21:59:38+05:30 IST