గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం: సత్యవతి
ABN , First Publish Date - 2021-03-24T08:39:21+05:30 IST
గిరిజనుల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రత్యేకంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

మార్చి 23 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రత్యేకంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించిందని, కేంద్రమే ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.