సి.ఆర్.పి.ఎఫ్ లో పోలీసు సంస్మరణ దినోత్సవం
ABN , First Publish Date - 2021-10-21T21:20:42+05:30 IST
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సి.ఆర్.పి.ఎఫ్), దక్షిణ సెక్టార్ ముఖ్య కార్యాలయం జూబ్లీహిల్స్, హైదరాబాద్ లో ‘‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు
హైదరాబాద్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సి.ఆర్.పి.ఎఫ్), దక్షిణ సెక్టార్ ముఖ్య కార్యాలయం జూబ్లీహిల్స్, హైదరాబాద్ లో ‘‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి ఐజిపి మహేష్ చంద్ర లడ్డా పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా లడ్డా మాట్లాడుతూ అక్టోబర్ 21న లద్దాఖ్ లో గల హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో 1959లో చైనా సైనికుల ఆకస్మిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన సి.ఆర్.పి.ఎఫ్ జవానుల త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో డిఐజి ఖాజా సజ్జానుద్దీన్, కమాండెంట్లు విశ్వనాథ్, రాజ్ ముకుత్ , సి.ఆర్.పి.ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.