టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకుంటేనే పథకాలు!

ABN , First Publish Date - 2021-02-28T07:45:42+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం ఉంటుందని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్య అన్నారు.

టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకుంటేనే పథకాలు!

ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్య సంచలన వ్యాఖ్యలు 

చిలుపూర్‌, ఫిబ్రవరి 27: టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం ఉంటుందని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్య అన్నారు. శనివారం ఆయన పలు గ్రామాల్లో పర్యటించి సభ్యత్వ నమోదు పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడిచిన ఆరున్నరేళ్ళ కాలంలో సీఎం కేసీఆర్‌ ఎన్నో ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టారని, రైతుబంధు, రైతుబీమా లాంటి ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రారంభించి దేశానికే మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. సీఎం ఆదేశాలమేరకు నియోజకవర్గంలో 60 వేల క్రియాశీల, సాధారణ సభ్యత్వాలను పూర్తి చేశామని తెలిపారు. 

Updated Date - 2021-02-28T07:45:42+05:30 IST