కోర్టు తీర్పు ఉంటే పాస్బుక్
ABN , First Publish Date - 2021-05-08T07:56:53+05:30 IST
న్యాయస్థానం తీర్పుల ఆధారంగా పట్టాదారు పాస్పుస్తకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ధరణిలో కొత్త ఆప్షన్ను శుక్రవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు.

ధరణిలో అందుబాటులోకి కొత్త ఆప్షన్
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానం తీర్పుల ఆధారంగా పట్టాదారు పాస్పుస్తకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ధరణిలో కొత్త ఆప్షన్ను శుక్రవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. వివిధ కారణాలతో పాస్పుస్తకాల జారీని నిలిపివేస్తే.. ఆ కేసులో న్యాయస్థానం రైతులు/భూ యజమానులకు అనుకూలంగా తీర్పులు వెలువరిస్తే.. ధరణిలో పాస్పుస్తకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం ధరణి వెబ్సైట్ లేదా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.