శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-07-24T16:52:00+05:30 IST
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు వరద పోటెత్తుతుంది. అప్రమత్తమైన అధికారులు 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 1,75,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ఫ్లో 1,70,000 క్యూసెక్కులుగా ఉంది

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు వరద పోటెత్తుతుంది. అప్రమత్తమైన అధికారులు 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 1,75,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ఫ్లో 1,70,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,089 అడుగులు ఉంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 80.139 టీఎంసీలుగా ఉంది.