50 చాంబర్లతో హైకోర్టులో నూతన భవనం

ABN , First Publish Date - 2021-07-08T08:10:14+05:30 IST

న్యాయవాదుల సౌకర్యార్థం రాష్ట్ర హైకోర్టు ఆవరణలో 50 చాంబర్లతో మరో భవనం అందుబాటులోకి రానుంది. రూ.12.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ‘లా చాంబర్స్‌’

50 చాంబర్లతో హైకోర్టులో నూతన భవనం

హైకోర్టు సీజే హిమ కోహ్లి చేతుల మీదుగా భూమి పూజ 


హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదుల సౌకర్యార్థం రాష్ట్ర హైకోర్టు ఆవరణలో 50 చాంబర్లతో మరో భవనం అందుబాటులోకి రానుంది. రూ.12.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ‘లా చాంబర్స్‌’ భవనానికి బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమ కోహ్లి శంకుస్థాపన చేశా రు. న్యాయవాదులకు చాంబర్ల సౌకర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో  మూడంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు.  రోడ్లు, భవనాల శాఖ రూ.12.33 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనుంది. ఇదే ప్రాంగణంలో నిర్మించతలపెట్టిన చైల్డ్‌ కేర్‌ సెంటర్‌, డిస్పెన్సరీ భవనాలకూ జస్టిస్‌ హిమ కోహ్లి శంకుస్థాపన చేశారు.  

Updated Date - 2021-07-08T08:10:14+05:30 IST