ఈటల అంశంపై ప్రత్యేకంగా స్పందిస్తా: ఆర్.కృష్ణయ్య
ABN , First Publish Date - 2021-05-07T09:39:45+05:30 IST
ఈటల రాజేందర్ అంశంపై ప్రత్యేకంగా స్పందిస్తానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.
బర్కత్పుర, మే 6 (ఆంధ్రజ్యోతి): ఈటల రాజేందర్ అంశంపై ప్రత్యేకంగా స్పందిస్తానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. కాచిగూడలో గురువారం బీసీ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల అంశంపై మీరెందుకు స్పందించడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. అచితూచి మాట్లాడారు. రాష్ట్రంలో బలమైన బీసీ సంఘాలు ఉన్నాయని, వాటిని సంప్రదించిన తర్వాత స్పందిస్తానని అన్నారు. తాను ఎప్పుడూ బీసీలు, నిరుద్యోగుల సమస్యలపైనే పోరాడుతున్నానని, ఒక వ్యక్తికి సంబంధించిన అంశంపై ఎన్నడూ స్పందించలేదని తెలిపారు. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ పట్ల పూర్తి విశ్వాసం ఉందన్నారు.