హైదరాబాద్‌ ‘మెట్రో’కు జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2021-03-05T16:02:56+05:30 IST

సోషల్‌ మీడియాను వినియోగించి తమ బ్రాండ్‌ను శక్తివంతంగా

హైదరాబాద్‌ ‘మెట్రో’కు జాతీయ అవార్డు

హైదరాబాద్‌ సిటీ : సోషల్‌ మీడియాను వినియోగించి తమ బ్రాండ్‌ను శక్తివంతంగా మార్చడంలో హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రయత్నాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా 2020 సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల్లో సోషల్‌ మీడియా ఫర్‌ పీఆర్‌ అండ్‌ బ్రాండింగ్‌ విభాగంలో హైదరాబాద్‌ మెట్రో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది.


గురువారం జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎల్‌ అండ్‌ టీ ఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. సృజనాత్మకత, వినూత్నమైన ప్రచారాల ద్వారా ప్రయాణికులతో అనుబంధం ఏర్పరచుకోవడానికి కృషిచేసిన బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ రాణిమోర్య, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌, పీఆర్‌ఎ్‌సఐ అధ్యక్షుడు డాక్టర్‌ అజిత్‌ పాఠక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T16:02:56+05:30 IST