సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా నరేందర్రావు
ABN , First Publish Date - 2021-12-23T08:44:56+05:30 IST
తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘం అధ్యక్షుడిగా మాధవరం నరేందర్రావు మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, ప్రభుత్వ అదనపు కార్యదర్శి టి.శేఖర్ నుంచి నియామక పత్రం అందుకున్నారు. ఈ కార్యవర్గం 2024 వరకు బాధ్యతలు నిర్వహిస్తుంది. ప్రధాన కార్యదర్శిగా షేక్ యూసఫ్ మియా, కోశాధికారిగా రాజేశం, ఉపాధ్యక్షులుగా లింగమూర్తి, శ్యామ్సుందర్, రాజేశ్వర్రెడ్డి, మంగమ్మ, కార్యదర్శులుగా రమేష్, శ్రీనివాసరావు, నవీన్కుమార్, ఉమా నాగలక్ష్మి, పబ్లిసిటీ సెక్రటరీగా శివాజీ, సాంస్కృతిక కార్యదర్శిగా అరవింద్ గౌడ్, క్రీడా కార్యదర్శిగా స్వరణ్ రాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా దేవరాజు, సయ్యద్ అబ్దుల్ ఖదీర్, కరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.