కోరం లేకుండానే మున్సిపల్ సమావేశం

ABN , First Publish Date - 2021-02-26T21:39:59+05:30 IST

కోరం లేకుండానే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని మున్సిపల్ కమిషనర్

కోరం లేకుండానే మున్సిపల్ సమావేశం

సంగారెడ్డి: కోరం లేకుండానే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని మున్సిపల్ కమిషనర్ నిర్వహించారు. కమిషనర్ నిర్వాహకంపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనతో మరోసారి కౌన్సిలర్లు, కమిషనర్‌కు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఈ ఘటన జిల్లాలోని అందోల్ - జోగిపేట మునిసిపాలిటీలో జరిగింది. జోగిపేట మునిసిపాలిటీలో కోరం లేకుండానే కమిషనర్ మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. 


అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ  కౌన్సిలర్స్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. గత కొన్నాళ్లుగా కమిషనర్ తీరుపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు  కినుక వహిస్తున్నారు. మున్సిపల్ రూల్స్‌కు విరుద్ధంగా కోరం లేకుండా మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. 20 మంది కౌన్సిలర్లకు 8 మంది కౌన్సిలర్లు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. మెజారిటీ లేకుండానే ఏజెండాలో పొందుపరిచిన అంశాలకు ఆమోదం లభించింది.

Updated Date - 2021-02-26T21:39:59+05:30 IST