Mulugu: సీఆర్పీఎఫ్ బెటాలియన్లో కాల్పుల కలకలం..
ABN , First Publish Date - 2021-12-26T17:01:25+05:30 IST
ములుగు జిల్లాలోని వెంకటాపురం 39 సీఆర్పీఎఫ్ బెటాలియన్లో కాల్పులు కలకలం రేపాయి. సీఆర్ఫీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉమేష్చంద్రపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా అదే

ములుగు: ములుగు జిల్లాలోని వెంకటాపురం 39 సీఆర్పీఎఫ్ బెటాలియన్లో కాల్పులు కలకలం రేపాయి. సీఆర్ఫీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉమేష్చంద్రపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా అదే తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఎస్ఐ ఉమేష్ చంద్ర అక్కడికక్కడే మృతి చెందగా...తమిళనాడుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ స్ఠీఫెన్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానిక కానిస్టేబుళ్లు స్టీఫెన్ను హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తల, ఛాతీ భాగంలో బుల్లెట్ గాయాలు కావడంతో స్టీఫెన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.