మెగాస్టార్ చిరంజీవికి ఎంపీ సంతోష్ కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2021-08-21T18:39:34+05:30 IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22. ఈ సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు.

మెగాస్టార్ చిరంజీవికి ఎంపీ సంతోష్ కృతజ్ఞతలు
చిరంజీవితో ఎంపీ సంతోష్ సెల్ఫీ(ఫైల్ ఫొటో)

హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22. ఈ సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరితయజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో తన అభిమానులంతా పాల్గొని, మూడు మొక్కలు నాటి, తనకు ట్విట్టర్‌లో ట్యాగ్ చేయాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. 


చిరంజీవి ట్వీట్‌పై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ మెగాస్టార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి పరిరక్షణపై మెగాస్టార్‌కు ఉన్న ప్రేమను ఆయన ట్వీట్ తెలియజేస్తోందన్నారు. ఆయన పుట్టిన రోజున అభిమానులంతా మొక్కలు నాటి చిరు కానుకను అందించాలని ఆకాంక్షించారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొనే ప్రతీ అభిమాని చిరుకు ట్యాగ్ చేయాలని సంతోష్ కుమార్ సూచించారు. తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలిచిన మెగాస్టార్ ఆయురారోగ్యాలతో కలకాలం అభిమానులను అలరించాలని ఎంపీ సంతోష్ ఆకాంక్షించారు.

Updated Date - 2021-08-21T18:39:34+05:30 IST