కేటీఆర్కు ఎంపీ రేవంత్రెడ్డి సవాల్
ABN , First Publish Date - 2021-01-25T03:05:25+05:30 IST
కేటీఆర్కు ఎంపీ రేవంత్రెడ్డి సవాల్
హైదరాబాద్: కొడంగల్ అభివృద్ధి తన టైమ్లోనే జరిగిందని ఎంపీ రేవంత్రెడ్డి చెప్పారు. తన హయాంలోనే కొడంగల్ ఆత్మ గౌరవం పెరిగిందన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులకు రంగులు వేసి తమవిగా టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. కేటీఆర్ దత్తత తీసుకున్నాక కొడంగల్కు ఒక్క కొత్త పథకం రాలేదన్నారు. కొత్త పథకం వచ్చినట్లు పోలేపల్లి ఎల్లమ్మ మీద ఒట్టేసి ఆధారాలు చూపిస్తారా? అని కేటీఆర్కు ఎంపీ రేవంత్రెడ్డి సవాల్ విసిరారు.