కరోనా తగ్గాక తిరుమలకు మరిన్ని బస్సులు
ABN , First Publish Date - 2021-11-26T09:46:27+05:30 IST
తెలంగాణ నుంచి తిరుమలకు ప్రస్తుతం 30 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, కరోనా తగ్గిన తర్వాత మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామని టీఎ్సఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.
టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
తిరుమల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి తిరుమలకు ప్రస్తుతం 30 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, కరోనా తగ్గిన తర్వాత మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. తిరుమలలో గురువారం శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు తెలిపారు.