దేశంలో అగ్రగామిగా తెలంగాణ: కవిత
ABN , First Publish Date - 2021-06-11T21:02:11+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలబెడుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
నిజామాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలబెడుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం కవిత మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను టీఆర్ఎస్ దేశవ్యాప్తంగా తెలియజేస్తోందన్నారు. ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ నూతన కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని జిల్లాల్లోని కార్యకర్తలకు టీఆర్ఎస్ కార్యాలయాలు అండగా ఉంటాయని కవిత తెలిపారు. ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని కవిత మండిపడ్డారు.