గుడుంబానే అసలు దెయ్యం: ఎమ్మెల్యే శంకర్
ABN , First Publish Date - 2021-10-20T00:53:58+05:30 IST
గూడూరు మండలం పాటిమీదిగూడెంలో దెయ్యం భయానికి గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మహబూబాబాద్: గూడూరు మండలం పాటిమీదిగూడెంలో దెయ్యం భయానికి గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దెయ్యం భయంతో ఊరు ఖాళీ చేశారని ఏబీఎన్లో కథనం ప్రచురించడం జరిగింది. ఏబీఎన్ కథనంపై స్పందించి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గ్రామంలో పర్యటించారు. గుడుంబానే అసలు దెయ్యమని శంకర్ నాయక్ అన్నారు. గుడుంబా తాగడం మానేస్తే దెయ్యాలు పోతాయని ఆయన సూచించారు.