పట్టుబట్టి మరీ వేధిస్తున్నారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2021-01-12T21:51:19+05:30 IST
సంగారెడ్డి జిల్లా కలెక్టర్, కొందరు అధికారులు టీఆరెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా కలెక్టర్, కొందరు అధికారులు టీఆరెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అధికారులపై చర్యలు తప్పవన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్పంచ్లను పార్టీ మారమని స్వయంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పట్టుబట్టి మరీ వేధిస్తున్నారని చెప్పారు. సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు ఏం గొప్ప పనిచేసాడని సీఎం ప్రశంసించాడో అర్థం కావడం లేదన్నారు. సీఎం దృష్టిలో మిగితా 32మంది కలెక్టర్లు బెస్ట్ కాదా? అని ఆయన ప్రశ్నించారు.