చలివాగును జీవధారగా మలుస్తా..
ABN , First Publish Date - 2021-02-06T06:10:30+05:30 IST
చలివాగును జీవధారగా మలుస్తా..

రేగొండ, ఫిబ్రవరి 5: చలివాగును జీవధారగా మలిచేందుకు కృషి చే స్తానని, దానికనుగుణంగా ఎస్సార్ఎస్పీ నుంచి అవసరం మేరకు నీటిని తరలించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే గం డ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఎమ్మెల్యే విలేఖరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో చలివాగును జీవధారగా మలిచి, నిత్యం నీళ్లు నిలువ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నీళ్లు నిల్వ ఉంటే రేగొండ, చిట్యాల, టేకుమట్ల రైతులకు సాగునీరందిచవచ్చని, నియోజకవర్గంలోని ప్రతీ ఇంచు భూమి సాగు నీరందించేలా కృషి చేస్తానన్నారు. జడ్పీటీసీ సాయిని విజయ, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రవిందర్రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దాసరి నారాయణరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాపిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోడెం ఉమే్షగౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మటిక సంతోష్, సర్పంచులు శ్రీనివాసరావు, సంతోష్, ఎంపీటీసీ సుమలత, కొలెపాక భిక్షపతి, మైస భిక్షపతి, లెంకల రాజిరెడ్డి పాల్గొన్నారు.